About Mukta

“In my ‘soul’ a totally new original form is ripening that ignores all rules and conventions. It breaks them by the power of ideas and strong conviction. I want to affect people like a clap of thunder, to inflame their minds not by speechifying but with the breadth of my vision, the strength of my convictions, the power of my expression”

Friday, April 4, 2014

ముక్త : తెలంగాణా ఉమెన్స్ కలెక్టివ్ మేనిఫెస్టో -2014

             ముక్త : తెలంగాణా ఉమెన్స్ కలెక్టివ్ మేనిఫెస్టో -2014

·         తెలంగాణా కోసం ,నూతన సమాజం కోసం కలగంటూ నేలకొరిగిన అమరవీరులకు నివాళిగా 
మెమోరియల్ పార్క్ తో పాటుగా ఒక 'తెలంగాణా కల్చర్ సెంటర్ ' నిర్మించాలె గ్రామీణ ,పట్టణ ప్రాంత మేధావులు ,రచయితలూ,కళాకారులూ ,కవులూ ,ఉద్యమకారులు కలిసి చర్చలు 
నిర్వహించుకునేటందుకు  సెంటర్ లో  ఉచితంగా హాల్ లాంటి సౌకర్యాలను కల్పించాలె . 
ప్రగతిశీల ఆలోచనలకూ ఆచరణలకు దారులు వేయాలె  .  


·         అమరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలె . ఉద్యమ సందర్భం లో విద్యార్థులపై 
పెట్టిన కేసులను ఎత్తివేయాలె 


·         2014 సంవత్సరాన్ని తెలంగాణా మహిళా  సంవత్సరంగా ప్రకటించుకోవాలె


·         రాజకీయ పార్టీలతో సంభందం లేని మేధావులతో కూడిన 'రాష్ట్ర ప్రణాళిక సంఘాన్ని '                   నియమించాలె . అందులో 50% మహిళా మేధావులకు భాగస్వామ్యం ఉండాలె . తెలంగాణా రాష్ట్ర నిర్మాణానికి,అభివృధికి  కావలిసిన ప్రణాళికలు రచించడం లో 'స్థానికతతాత్విక భూమిక కావాలె. .      ఉమ్మడి రాజధాని గా హైదరాబాదు 3 ఏళ్లకు మించకూడదు . 


·         తెలంగాణా లో ప్రస్తుతం ఉన్న సీమాంద్ర ఉద్యోగులకు 2 ఏండ్ల సమయం లో బదిలీ చేయించుకొని తమ సొంత రాష్ట్రానికి వెళ్ళడానికి లేదంటే ఇక్కడే ఉండదల్చుకుంటే తమ పెన్షన్లను 
వదిలేసుకోవడానికి అవకాశం ఇవ్వాలె . 


·          సం ల లోపలనే రెండు రాష్ట్రాలకు 2 హై కోర్టులు ఏర్పర్చాలె


·         ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీ కౌన్సిల్ లకు స్వయం నిర్ణయాధికారాన్ని ఇవ్వాలె 


·         మహిళల శరీరాలపై జీవితాలపై పై జరుగుతున్న హింసను అడ్డుకోవాలెవెంటనే తెలంగాణా      మహిళా కమీషన్ ప్రకటించాలెఎక్సైజ్  ,విద్య ,మీడియా వంటి రంగాల్లో తెలంగాణా మహిళా  కమీషన్ కి,ఆయా శాఖల ప్రణాళికలలో సంపూర్ణ నిర్ణయాధికారాన్ని ఇవ్వాలె . జిల్లా మహిళా 
కమిటీలు కమీషన్ తో సమన్వయం చేసుకుంటూ ఆయా రంగాల్లో ప్రణాలికల అమలుకు  
పనిచేయాలె


·         మహిళా పంచాయితీలను  ప్రోత్సహించాలెకుల వర్గ ప్రాంత అసమనతల్లో మగ్గుతున్న స్త్రీలకు  పంచాయితీలు 'కౌన్సిలింగ్ ' సెంటర్స్  ఉపయోగపడాలె
·         స్త్రీల  ఉన్నత విద్యావకాశాలు మెరుగుపర్చడం కోసం తక్షణ ప్రణాళికలు యుద్ద ప్రాతిపదికన 
ప్రారంభించాలె. వెంటనే  2 మహిళా యునివెర్సిటిలను  నెలకొల్పాలె .  వక్ఫ్ భూములను వెనక్కి తీసుకొని ఓల్డ్ సిటి లో ఒక సెంట్రల్ 'మహిళా విశ్వ విద్యాలయాన్ని
 ఏర్పాటు చేయాలె.ఒక  స్టేట్  మహిళా యునివెర్సిటీ ని మహబూబ్ నగర్ జిల్లాలో  నెలకొల్పాలె .


 జిల్లాల వారిగా మానవ ,సామజిక శాస్త్రాల్లో  ఉన్నత విద్యా మండళ్లను ఏర్పాటు చేయాలె .వాటిల్లో ఉమెన్ స్టడీస్ విభాగాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలె
·         ప్రైవేటు బళ్ళను నిషేదించి ,ప్రభుత్వ బళ్ళను పటిష్థం చేయాలె . అంగన్వాడి టీచర్లకు మాంటిసోరి 
శిక్షణా,2 షిఫ్ట్ లలో బాలల కేంద్రాలు ఏర్పాటు చేయాలెభాషా శిక్షణా కేంద్రాలను బడులకు 
అనుసంధానం చేయాలె ,గ్రామీణ యువత,విద్యార్థులు ,మహిళలకు  భాషల్లో ఉచిత శిక్షణ
 ఏర్పాటు చెయ్యాలె .
·         ప్రైమరి స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు/ఉర్దూ  భాషల ను 'ఫస్ట్ లాంగ్వేజెస్ ' గా తప్పనిసరి చేయాలె .  

·         పాఠ్యాంశాలలో స్థానిక జ్ఞానాలకు,చరిత్రకూ ,కళలకు ,భాషా ప్రయోగాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలెకొఠారి కమిషన్ ఇచ్చిన సూచనల ప్రకారం ,స్థానిక వృత్తి నైపుణ్యాలను ప్రైమరీ స్థాయి నుంచే కర్రికులమ్ లో భాగం చేయాలె
·         ప్రతి జిల్లాలో పిల్లల గ్రంధాలయం ,కల్చర్ సెంటర్ విభాగం తప్పని సరిగా ఏర్పాటు చేయాలె . 
గ్రామీణ కళలకు పూర్తి ప్రోత్సాహం అందిచ్చాలె  నాటక ,సినిమా రంగాలను ప్రోత్సహించే 'థియేటర్ ,ఫిలిం ఇన్స్టిట్యూట్ ' లను వెంటనే నెలకొల్పాలెస్థానిక  చిత్రకారుల ప్రసిద్ధ చిత్రాలను ప్రదర్శించే
 ఆర్ట్ మ్యూజియం  ఏర్పాటు చేయాలె .    


·         చిన్నగ్రామీణ పరిశ్రమల నైపుణ్యాలను నేర్పే శిక్షణా సంస్థలను ఉన్నత విద్యకు అనుసంధానం 
చేయాలె.

·         చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలెఅందుకోసం ప్రత్యేక కార్పోరేషన్లను ఏర్పాటు చేయాలె. 


·         ఉద్యోగినులకు రవాణా సౌకర్యాలను కల్పించే భాద్యతను అన్ని ప్రభుత్వ ,ప్రభుత్వేతర సంస్థలకు
           తప్పనిసరి చేయాలె . 



·         ప్రకృతి పరిరక్షణ ప్రణాళికల్లో స్త్రీల భాగస్వామ్యం ఉండాలె . గుట్టల పై పూర్తి హక్కు గ్రామ 
పంచాయితిలకు ఉండాలెగ్రానైట్ ఎగుమతిని నిషేదించాలె  .  ఊరి రాయి  ఊరికే అన్న 
నిభందన పెట్టాలె.   చెట్లను నరకడాన్ని  తీవ్రంగా పరిగణించాలె .


·         చెరువుల పరిరక్షణ ,చిన్న నీటి పారుదల ప్రాజెక్టుల,రక్షిత మంచినీటి పథకాలపై  పై అజమాయిషీ మహిళా పంచాయితిలకు ఉండాలెనల్గొండలో  పథకాలను వెంటనే అమలుచేయాలె  .


·         ఊరికొక లేడీ డాక్టర్ నీ ,అన్ని ఆధునిక సౌకర్యాలున్న  ఉచిత 'బర్తింగ్ సెంటర్ ' ను ఏర్పాటు 
          చేయాలె.  


·         ముల్కీ పరిశ్రమలను ప్రోత్సహించాలె  . అందుకోసం పూర్వ నిజాం రాష్ట్రంలో చేసిన చట్టాలను 
పునరధ్యయనం చేయాలె .  


·         వ్యవసాయం,నేత పరిశ్రమలకు పూర్తి ప్రోత్సాహం ఇవ్వాలె . మార్కెటింగ్ సౌకర్యాలు , రాయితీలు వెంటనే ప్రకటించాలె  . 


·         స్థానిక విత్తన బ్యాంకులను నెలకొల్పాలెస్థానిక విత్తన పరిశోధన లను ప్రోత్సహించాలె. విత్తనాలపై ప్రైవేటు కంపెనీల జోక్యాన్ని రద్దు చేయాలె . విత్తన ఉత్పత్తి కేంద్రాల అజమాయిషీ స్త్రీ సంఘాలకు అప్పగించాలె

·         విద్యుత్ ఉత్పత్తి లో తెలంగాణా కి పూర్తీ రాయితీలు  ఇవ్వాలె   సౌర విద్యుత్ ప్రణాళికలను ప్రోత్సహించాలె .   


·         ఇంతవరకు నీటి వాటాలో తెలంగాణా నష్టపోయిన దానికి పరిహారం ప్రకటించాలె  . పోలవరం  ప్రాజెక్టు నిర్మాణం ఆపేసి ప్రత్యామ్నాయ పద్దతుల గురించి అన్వేషించాలె  . ముంపు గ్రామాలపై 
 వచ్చిన ఆర్డినెన్సు ను ఉపసంహరించుకోవాలె .


·         పాలనా వ్యవస్థల్లో అన్ని స్థాయిల్లో (దామాషా ప్రకారం) స్త్రీల భాగస్వామ్యాన్ని 50% వరకు పెంచాలె .